Chiranjeevi : అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి ఘన సత్కారం.. వీడియో వైరల్

అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి అభిమానుల ఘన సత్కారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

Chiranjeevi : అమెరికాలో పద్మవిభూషణ్ చిరంజీవికి ఘన సత్కారం.. వీడియో వైరల్

Padma Vibhushan chiranjeevi is felicitated by USA Mega fans

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన పద్మవిభూషణ్ కి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డు అందుకోవడంతో.. ఇండస్ట్రీలోని వ్యక్తులు, అభిమానులు చిరుకి సత్కారం చేయడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఈక్రమంలోనే అమెరికాలో ఉన్న అభిమానులు.. చిరంజీవిని ఘనంగా సత్కరించడం కోసం అక్కడ ఒక గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సత్కార వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. తనకి పద్మవిభూషణ్ అవార్డు వచ్చినందుకు, అలాగే తనని ఇంతలా అభిమానిస్తున్న ప్రేక్షకుల అభిమానం తనకి అవార్డుకి దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also read : Vishwambhara : ‘విశ్వంభర’లో చిరంజీవి డ్యూయల్ రోల్.. ఆసక్తి కలిగిస్తున్న నిర్మాతల పోస్టు..

కాగా త్వరలోనే టాలీవుడ్ ఫిలిం కౌన్సిల్.. ఘనంగా ఓ సత్కార సభని చేయబోతుంది. ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని హీరోలు, స్టార్ మేకర్స్ అంతా కూడా వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ ఈవెంట్ కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్ లో మెగా హీరోలతో పాటు ఇతర హీరోలను కూడా ఒకే వేదిక పై చూడొచ్చని క్యూరియాసిటీతో ఉన్నారు. మరి ఆ ఈవెంట్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో గ్రాఫికల్ వండర్ గా రూపొందించబోతుంది. ఇక ఈ సినిమాలో త్రిష ఫిమేల్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా సిద్దమవుతుంది.