IPL 2024 : కేకేఆర్ యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఎవరు?
ఐపీఎల్లో తొలి సారి బ్యాటింగ్కు దిగిన రఘువంశీ చక్కటి బ్యాటింగ్తో అలరించాడు.
IPL 2024 – Angkrish Raghuvanshi : విశాఖ వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఐపీఎల్లో రెండో అత్యధిక స్కోరును సాధించింది. కోల్కతా భారీ స్కోరు సాధించడంలో సునీల్ నరైన్(39 బంతుల్లో 85)తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54) కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో తొలి సారి బ్యాటింగ్కు దిగిన రఘువంశీ చక్కటి బ్యాటింగ్తో అలరించాడు. దీంతో ఈ యువ ఆటగాడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.
అంగ్క్రిష్ రఘువంశీ ఎవరు?
అంగ్క్రిష్ రఘువంశీ 5 జూన్ 2005లో ఢిల్లీ జన్మించాడు. అయితే.. అతడి చిన్నతనంలోనే అతడి తల్లిదండ్రులు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ప్రతిభావంతులైన బ్యాటర్ అభిషేక్ నాయర్, ఓంకార్ సాల్విల కోచింగ్లో క్రికెట్లో రఘువంశీ ఓనమాలు నేర్చుకున్నాడు. ముంబై తరపున 2023-24 సీజన్లో లిస్ట్ ఏ, టీ20లలో అరంగేట్రం చేశాడు.
Suryakumar Yadav : సునీల్ నరైన్.. కాస్త నవ్వవయ్యా బాబు : సూర్యకుమార్
సీకే నాయుడు ట్రోఫీ ద్వారా వెలుగులోకి వచ్చాడు. కేవలం తొమ్మిది మ్యాచుల్లో 765 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి అతడిపై పడింది. ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో రూ.20లక్షల బేస్ప్రైజ్తో వేలంలోకి వచ్చిన అతడిని అదే ధరకు కోల్కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో అతడు అరంగ్రేటం చేశాడు. అయితే.. ఈ మ్యాచ్లో అతడికి బ్యాటింగ్ రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో బ్యాటింగ్లో అవకాశం వచ్చింది. వన్డౌన్లో వచ్చిన అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 27 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అతి పిన్నవయసులో అర్థశతకం సాధించిన ఏడో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. కాగా.. రఘవంశీ వయస్సు 18 ఏళ్ల 304 రోజులు.
Rishabh Pant : కోల్కతాపై ఘోర ఓటమి.. పంత్కు రూ.24 లక్షల జరిమానా..