Virat Kohli : అరుదైన రికార్డు పై కోహ్లి కన్ను.. ఐర్లాండ్తో మ్యాచ్లోనే అందుకుంటాడా..?
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
Virat Kohli Needs 9 Fours : టీ20 ప్రపంచకప్లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. నాసా కంట్రీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి ప్రపంచకప్లో ఘనంగా బోణీ కొట్టాలని భారత జట్టు భావిస్తోంది. అటు టీమ్ఇండియాకు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ పట్టుదలగా ఉంది.
ఇదిలా ఉంటే.. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లికి మరో 9 బౌండరీలు అవసరం. ప్రస్తుతం కోహ్లి అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో ఐర్లాండ్తో మ్యాచ్లోనే అతడు ఈ రికార్డును అందుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Pakistan : అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసిన పాకిస్తాన్ జట్టు.. ఒక్కొక్కరికి 25 డాలర్లు..!
కాగా.. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడి రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే పేరిట ఉంది. జయవర్ధనే 31 టీ20 ప్రపంచకప్ మ్యాచుల్లో 111 ఫోర్లు బాదాడు. కోహ్లి 27 ప్రపంచకప్ ఇన్నింగ్స్ల్లో 103 ఫోర్లు కొట్టాడు. మరీ కోహ్లి తొమ్మిది ఫోర్లు కొట్టి ఐర్లాండ్తో మ్యాచ్లోనే ఈ రికార్డు అందుకుంటాడో లేదో చూడాల్సిందే.
ఇక టీమ్ఇండియా తన తదుపరి మ్యాచ్ జూన్ 9న పాకిస్తాన్తో ఆడనుంది. జూన్ 12న అమెరికాతో, జూన్ 15న కెనడాతో తలపడనుంది. గ్రూపుఏ లో ఉన్న భారత్ సూపర్ 8కి అర్హత సాధించాలంటే గ్రూపులో టాప్-2 గా నిలవాల్సి ఉంది.
Pakistan : అయ్యో పాకిస్తాన్.. ప్రపంచకప్లో మొదటి మ్యాచ్కు ముందే బిగ్ షాక్..