కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన నడ్డా, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్

JP Nadda: రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, హెచ్‌డీ కుమారస్వామి...

కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన నడ్డా, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్

అందరూ అనుకున్నట్లుగానే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో ఒక పదవిలో ఉన్న వారికి మరో పదవి ఇవ్వరు కాబట్టి.. కొన్ని నెలల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతలు మరో నేతకు అప్పగించే అవకాశం ఉంది.

ఇవాళ ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తో ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయించారు.

మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, తదితరులతో కేంద్ర మంత్రులుగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

అలాగే, జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్, అశ్వనీ వైష్ణవ్, జుయల్ ఓరం, తదితరులు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.

Narendra Modi: సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా? ఎందుకంటే?