మహేశ్బాబు, రాజమౌళి కాంబో మూవీపై సస్పెన్స్
మొత్తానికి మహేశ్ సినిమా మూడు పార్ట్లుగా ఉంటుందనే సమాచారం టాలీవుడ్ను షేక్ చేస్తోంది.
మహేశ్బాబు, రాజమౌళి కాంబోలో నిర్మించనున్న చిత్రంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. త్వరలో సెట్స్పైకి రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సీక్వెల్స్పైనా ఇప్పుడు చర్చ మొదలైంది. టాలీవుడ్ స్టార్స్తోపాటు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ చిత్రం సీక్వెల్పై వచ్చిన తాజా గాసిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు ముగిసిందని టాలీవుడ్ టాక్. సెప్టెంబరులో ఈ సినిమాని సెట్స్కి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. ఆగస్టులో సెట్ వర్క్ పూర్తి చేసి, సెప్టెంబర్లో సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా మరో ఇన్ఫర్మేషన్ టాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది.
మూడు పార్టులుగా?
తాజా సమాచారం ప్రకారం మహేశ్బాబుతో తీసే సినిమాను మూడు పార్టులుగా తీయాలని దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిపాదిస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ కు చాలా ఎక్కువ స్కోప్ ఉండే మూవీని మూడు పార్టులుగా తీస్తే బాగా వర్క్ అవుట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట.. అయితే మహేశ్ బాబు పార్ట్ 1, పార్ట్ 3లో మాత్రమే ఉంటాడని, పార్ట్ 2లో మాత్రం హలీవుడ్ స్టార్ చేస్తాడని చెబుతున్నారు.
పార్ట్ 3లో మహేశ్, హలీవుడ్ స్టార్ కలిసి చేస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇదే నిజమైతే రాజమౌళి సినిమా మూడు భాగాలలో విజువల్ గ్రాఫిక్స్ వండర్గా వుండబోతుందంటున్నారు. ఇక మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుల సెలెక్షన్స్ను రాజమౌళి టెస్ట్ షూట్స్ చేస్తున్నాడు.
మొత్తానికి మహేశ్ సినిమా మూడు పార్ట్లుగా ఉంటుందనే సమాచారం టాలీవుడ్ను షేక్ చేస్తోంది. బాహుబలి చిత్రాన్ని రెండు పార్ట్లుగా తీసిన జక్కన్న… ఆ సినిమా నిర్మాణానికి ఐదేళ్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను మూడు పార్ట్లుగా తీస్తానంటే ఎంత టైమ్ పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. తన వర్క్పై రాజీ పడని రాజమౌళి…. మూడు భాగాలుగా సినిమా చేస్తానంటుండటమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
Also Read: లండన్ విమానం ఎక్కిన రామ్చరణ్.. పెళ్లి నుంచి డైరెక్ట్గా..?