BCCI : టీమ్ఇండియా టెస్టు క్రికెటర్లకు షాకిచ్చిన బీసీసీఐ..! జట్టులో ప్లేస్ కావాలంటే..
టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ ఓ సరికొత్త కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
BCCI – Team India : టీమ్ఇండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అధికారికంగా ఈ పర్యటనతోనే హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే గంభీర్ తన దైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాడట. అందులో భాగంగానే టెస్టు క్రికెట్ ఆడే ఆటగాళ్లకు బీసీసీఐ ఓ సరికొత్త కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
సెప్టెంబర్ నుంచి టీమ్ఇండియా టెస్టు సీజన్ మొదలవనుంది. అంతకంటే ముందే టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్ నెలలో జరిగే దులీఫ్ ట్రోఫీలో టీమ్ఇండియా టెస్ట్ జట్టులోని రెగ్యులర్ సభ్యులు ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ఖచ్చితంగా ఒక్కొ ఆటగాడు ఒకటి లేదా రెండు మ్యాచులు ఆడేలా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
అయితే.. ఈ విషయంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు మినహాయింపు ఇచ్చింది. కీలక ఆటగాళ్లు అయినా ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే ఈ మినహాయింపు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా టెస్ట్ సీజన్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. స్వదేశంలో సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ను ఆడనుంది. ఆ తరువాత న్యూజిలాండ్తో మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడాల్సి ఉంది. అనంతరం టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ నవంబర్ 22 నుంచి జనవరి 7 మధ్యలో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. జూన్లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆడాలంటే.. టీమ్ఇండియా ఆడనున్న సిరీస్లోని మ్యాచుల్లో వీలైనన్ని ఎక్కువ టెస్టు మ్యాచులు గెలవడం చాలా ముఖ్యం.
IND vs SL : ఇక చాలు.. మీ ముగ్గురు ఆడాల్సిందే.. కోహ్లీ, రోహిత్, బుమ్రాలతో గంభీర్..!
BCCI would want the Test specialist to play in the Duleep Trophy in August ahead of the Test season. [PTI]
– For Seniors like Rohit, Virat & Bumrah, it will be their choice to play or not. pic.twitter.com/Kbya5SDOvw
— Johns. (@CricCrazyJohns) July 16, 2024