రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్- మంత్రి నిమ్మల రామానాయుడు
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.
![రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్- మంత్రి నిమ్మల రామానాయుడు రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్- మంత్రి నిమ్మల రామానాయుడు](https://10tv.in/wp-content/uploads/2024/08/Nimmala-Rama-Naidu.jpg)
Nimmala Rama Naidu : మాజీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్ అని ఆయన ధ్వజమెత్తారు. చేసిన తప్పులు పగలు-రాత్రి జగన్ కు గుర్తొస్తుండటంతో.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా రెడ్ బుక్కే గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారాయన. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు. ప్రజా తీర్పు ఓర్వలేను అన్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని జగన్ పై విరుచుకుపడ్డారు. నంద్యాల ఘటనలో ఎస్సీల భూమిని వైసీపీ నేత కబ్జా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గ్రామ పెద్ద వైసీపీ నేత నారప్ప రెడ్డికి భూమి తిరిగి ఇవ్వమని చెప్పటంతో అతనిపై దాడి చేయించారని చెప్పారు.
రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తిగత స్వార్ధం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయటంలో విఫలమై భంగపడిన రీతిలోనే ఇవాళ నంద్యాలలోనూ జగన్ బోల్తా పడ్డారని మంత్రి అన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని జగన్ గుర్తించాలని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?