ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీడియాకే తెలియాలి: యార్లగడ్డ వెంకట్రావు

రాజకీయాల్లో పవర్ అనేది అల్టిమేట్ అని, అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్లు కూడా రాజకీయం చేస్తారని, దమ్ముంటే ఇప్పుడొచ్చి ఎవరైనా..

ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో మీడియాకే తెలియాలి: యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkata Rao

భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చి మనుషులు చనిపోతుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ తరుఫున పోటీ చేసిన 16 మంది అభ్యర్థులు ఏమయ్యారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిలదీశారు. తనమీద పోటీ చేసిన ప్రత్యర్థి ఎక్కడ ఉన్నాడో తెలియదని, ఆయన ఎక్కడున్నాడో మీడియాకే తెలియాలని అన్నారు.

రాజకీయాల్లో పవర్ అనేది అల్టిమేట్ అని, అధికారంలో ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్లు కూడా రాజకీయం చేస్తారని, ఎవరైనా పిచ్చివాగుడు వాగుతారని అన్నారు. దమ్ముంటే ఇప్పుడొచ్చి ఎవరైనా మాట్లాడాలని సవాలు విసిరారు. చంద్రబాబు తన మీద పోటీ చేయాంటూ మీడియా అటన్షన్ కోసం వాగినవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని అడిగారు.

ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో కూర్చుని పిచ్చివాగుడు వాగారని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. కాగా, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వల్లభనేని వంశీ, 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ కేసులు ఎదుర్కొంటున్నారు.

Also Read: దువ్వాడ ప్యామిలీ ఇష్యూలో మరో ట్విస్ట్.. ఆ ఇంటికి చేరుకున్న దివ్వల మాధురి