హైదరాబాద్‌లో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న 13 మంది అరెస్టు.. ఎలా మోసం చేశారో తెలుసా?

నిందితుల నుంచి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న 13 మంది అరెస్టు.. ఎలా మోసం చేశారో తెలుసా?

Crime DCP Narasimha: హైదరాబాద్‌లో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ నరసింహ మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం… రాజస్థాన్‌కు చెందిన ఆ ముఠా 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడింది.

నిందితుల నుంచి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ సీసీఎస్, కేపీహెచ్‌బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను లక్ష్యంగా చేసుకుని వారు యూపీఐ మోసాలకు పాల్పడ్డారు. మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు పాల్పడిది ఈ ముఠా.

బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మోసం చేయడానికి ముందు కస్టమర్లుగా ఎలక్ట్రానిక్ షో రూమ్ లకు ఆ ముఠా సభ్యులు వెళ్తున్నారు. వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తామని చెబుతారు.

అయితే, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్‌లోని సహచరులకు పంపుతున్నారు ముఠా సభ్యులు. రాజస్థాన్‌లోని సహచర ముఠా సభ్యులు క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు చేస్తున్నారు. వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటూ బ్యాంకును ఆశ్రయిస్తోంది ముఠా.

బ్యాంకు ఆదేశాలతో చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతోంది. రాజస్థాన్ కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుంది. నిందితులపై మూడు కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి.

Devineni Avinash: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాశ్