ఏపీలో కొత్తగా 1,732 కరోనా కేసులు, 14 మంది మృతి
new corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,732 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,405 సాంపుల్స్ పరీక్షించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కు చేరింది. కొత్తగా 14 మంది కరోనాతో మృతి చెందారు.
దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 6828కి చేరింది. ఈ మేరకు బుధవారం (నవంబర్ 11, 2020) రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి మొత్తం 8,20,234 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు 88,63,340 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.