Andhra Pradesh Bifurcation: ఏపీ విభజనలో కాంగ్రెస్ అధికార గర్వమే కనిపించింది – ప్రధాని మోదీ
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు.
Andhra Pradesh Bifurcation: ఏపీ విభజనపై ప్రధాని నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశంలో కాంగ్రెస్ అధికార గర్వంతో పనిచేసిందని, శాంతియుతమైన పద్ధతిని పాటించలేదని విమర్శలు చేశారు.
‘ఏపీ విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ హడావుడిగా పూర్తి చేసేసింది. ఏపీ వల్ల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ రాష్ట్రానికే అన్యాయం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు. హడావుడిగా విభజన బిల్లును ఆమోదించేశారు. ఎలాంటి చర్చలు జరపకుండా మైక్లు కట్ చేశారు. మిర్చి స్ప్రే కొట్టారు’
‘ఇదేనా ప్రజాస్వామ్య పద్ధతి ? అటల్ బిహారీ వాజ్పేయి మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశారు. ఎలాంటి తుఫాను లేకుండా.. అందరూ కలిసి కూర్చొని బిల్లు పాస్ చేశారు. ఏపీ-తెలంగాణ విభజనలోనూ అలా జరిగి ఉంటే బాగుండేది’
Read Also : చిరుతిళ్లతో రోజంతా గడిపేస్తున్నారా?…
‘కాంగ్రెస్ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేసింది. దీని వల్ల ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సైతం లాభం జరగలేదు’
‘మేమెప్పుడూ సహకార సమాఖ్య, పోటీతత్వ వ్యవస్థను సృష్టించాం. జీఎస్టీ కౌన్సిల్ సహకార సమాఖ్య వ్యవస్థకు ఉత్తమ నిదర్శనం. అన్ని రాష్ట్రాలు, కేంద్రం కలిపే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి’ అని రాజ్యసభ వేదికగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు.