Tulasireddy : వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందూ దొందే : తులసిరెడ్డి

వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Tulasireddy : వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందూ దొందే : తులసిరెడ్డి

Tulasireddy

Tulasireddy criticized the YCP and TRS : వైసీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అప్పులు చేయడంలో.. అడుక్కుతినడంలో వైసీపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కడప జిల్లా వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధల తెలంగాణగా మార్చిందని విమర్శించారు.

స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం బుణాంద్రప్రదేశ్ గా మార్చిందని ఆరోపించారు. రాజన్న రాజ్యం పేరుతో రాక్షస రాజ్యం చేసిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ‘మా బిల్లులు చెల్లించండి మా ప్రాణాలు కాపాడండి’ అని కాంట్రాక్టర్లు భిక్షాటన చేయడం రాష్ట్రానికి సిగ్గుచేటు అన్నారు.

Varla Ramaiah : డీజీపీ గౌతమ్ సవాంగ్ కు వర్ల రామయ్య బహిరంగ లేఖ

బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఏ కంపెనీ కూడా వైద్యపరికరాలు సరఫరా చేయవద్దని వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనిట్ రెడ్ నోటీస్ ఇవ్వడం రాష్ట్రానికి అప్రతిష్ట అన్నారు. ఎయిడెడ్ విద్యార్థుల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం హర్షణీయమని కొనియాడారు.