విశాఖలో ఒకేరోజు పది మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. నగరంలో కొత్త కేసులు నమోదు కావడంతో స్థానికంగా భయాందోళనలు చెలరేగుతున్నామయి. తాజాగా నిన్న(25 మే 2020) ఒక్క రోజే 10మందికి కరోనా సోకడంపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. వీటితో కలుపుకుని నగరంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 99కి పెరిగింది.
వందేభారత్ మిషన్లో భాగంగా విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో ఐదుగురు కరోనా బారిన పడగా, అచ్యుతాపురం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని చిట్టిబోయినపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి వైరస్ సోకినట్లుగా అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 99 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన వారు 44 మంది కాగా, విదేశాల నుంచి వచ్చినవారు 45 మంది ఉన్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 2,896కు చేరింది. అలాగే, ఇప్పటి వరకు 56 మంది కరోనా బారినపడి చనిపోయారు.
Read: విదేశాల నుంచి ఏపీకి వచ్చిన పలువురికి కరోనా