Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 6 వేల 770 కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత నెలలో 15 వేలకు పైన నమోదైన కేసులు.. జూన్ నెలలో తగ్గుతూ వస్తున్నాయి.

Andhra Pradesh: కరోనా..24 గంటల్లో 6 వేల 770 కేసులు

Andhra Pradesh

Andhra Pradesh:  ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 6 వేల 770 మందికి కరోనా సోకింది. 58 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

85 వేల 637 యాక్టివ్ కేసులు ఉండగా..11 వేల 940 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో 1199 కరోనా కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 18,09,844 పాజిటివ్ కేసులకు గాను 17,12,267 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 85 వేల 637గా ఉంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు :-

చిత్తూరులో 12 మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, అనంతపూర లో నలుగురు, విశాఖపట్టణంలో నలుగురు, వైఎస్ఆర్ కడపలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు :-
అనంతపురం 367. చిత్తూరు 968. ఈస్ట్ గోదావరి 1199. గుంటూరు 433. వైఎస్ఆర్ కడప 473. కృష్ణా 440. కర్నూలు 299. నెల్లూరు267. ప్రకాశం 530. శ్రీకాకుళం 491. విశాఖపట్టణం 290. విజయనగరం 248. వెస్ట్ గోదావరి 765. మొత్తం : 6,770