ఆడపిల్లను పుట్టిందని పచ్చి బాలింత నోట్లో గుడ్డలు కుక్కి చావబాదిన అత్తింటివారు

  • Published By: nagamani ,Published On : November 26, 2020 / 11:40 AM IST
ఆడపిల్లను పుట్టిందని పచ్చి బాలింత నోట్లో గుడ్డలు కుక్కి చావబాదిన అత్తింటివారు

Ap Anantapur : ఆడపిల్లను కన్న కోడలికి నరకం చూపించారు అత్తింటివారు. పచ్చి బాలింత అని కూడా చూడకుండా దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు పెట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో కేంద్రంలోని నాయక్ నగర్ లో జరిగింది. ఏడు రోజుల బాలింతను చావబాదారు. ఆమె అరుపులు చుట్టు పక్కలవాళ్లు వినకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరీ చావబాదారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి బాలింత ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



వివరాల్లోకి వెళితే..అనంతపురం జిల్లాలోని ధర్మవరానికి చెందిన లక్ష్మిదేవి బాయికి ఆరేళ్ల క్రితం అనంతపురంలోని నాయక్‌నగర్‌కు చెందిన జగన్‌మోహన్‌ నాయక్‌తో వివాహమైంది. జగన్ మోహన్ చెన్నై ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ క్వాలిటీ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ నాలుగన్నరేళ్ల పాప ఉంది. ఈక్రమంలో లక్ష్మీదేవి మరోసారి గర్భందాల్చి బుధవారం (నవంబర్ 18,2020)న నగరంలోని స్నేహలత ఆస్పత్రిలో మరో ఆడబిడ్డను ప్రసవించింది. దీంతో అత్తింటివారు ఆగ్రహానికి గురయ్యారు. దరిద్రపు గొట్టు ఆడపిల్లల్ని వరస పెట్టి కంటున్నావ్..నువ్వో దరిద్రానివి అంటూ ఇష్టమొచ్చినట్లుగా తిట్టారు. హాస్పిటల్ లో ఆమెను ఏమాత్రం పట్టించుకోలేదు.



https://10tv.in/up-aligarh-fierce-negligence-the-rat-who-had-cornered-the-dead-body-of-the-just-born-baby-dm-ordered-an-anquiry/
22న లక్ష్మిబాయి డిశ్చార్జ్‌ అయ్యింది. కానీ అత్తింటివారు ఆమెను తీసుకెళ్లటానికి హాస్పటల్ కూడా రాలేదు. దీంతో ఆమె బిడ్డను తీసుకుని నాయక్‌నగర్‌లోని అత్తింటికి వెళ్లింది. అప్పటి నుంచి బాలింతకు ప్రత్యక్ష నరకం మొదలైంది.లక్ష్మీదేవి మామ శంకర్‌నాయక్‌(ఏఎస్‌ఐ, పీటీసీ), అత్త శాంతిబాయి, భర్త జగన్‌మోహన్‌ నాయక్ తో సహా మరిది పరమేష్‌నాయక్‌ లు కలిసి మానసికంగా, శారీరకంగా ఆమెను చిత్రహింసలకు గురిచేసేవారు. విచక్షణారహితంగా చితకబాదారు.



‘‘చిన్న కోడలు కట్నం కింద స్థలాలు, బోలెడంత డబ్బు తీసుకొచ్చిందనీ నువ్వేం తెచ్చావ్ పుట్టింటినుంచి పైగా ఇద్దరు ఆడపిల్లల్ని కన్నావ్..వాళ్ల ఖర్చులు ఎవరి భరిస్తారు? నీ బాబా లేదక నీ తాత సంపాదించిన ఆస్తులేమన్నా ఉన్నాయా నీ కూతుళ్లను పెంచటానికి’’ అంటూ ఈటెల్లాంటి మాటలతో మానసికంగాను..దెబ్బలతో శారీరకంగాను నానా చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రెండోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చావని కొట్టారు.



ఈ క్రమంలో బుధవారం ఉదయం లక్ష్మిదేవిబాయిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె దెబ్బలు తాళలేక కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు విన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన అత్తా,మామ, భర్తా, మరిది కలిసి ఆమె నోట్లో గుడ్డలుకుక్కేశారు.


ఈ విషయంపై ఇరుగు పొరుగువాళ్లు టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే వచ్చిన పోలీసులు బాలింతను స్టేషన్‌కు తరలించి ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకుని అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తా, మామ, భర్త, మరిదిపై పోలీసులు కట్నం, వేధింపులు తదితర కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.