AP Covid-19 Updates : ఏపీలో 10వేలకు చేరువలో కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 10వేలకు చేరువలో నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు.

AP Covid-19 Updates : ఏపీలో 10వేలకు చేరువలో కరోనా కేసులు

AP Covid-19 Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 10వేలకు చేరువలో నమోదయ్యాయి. ఏపీలో కొత్తగా 9,716 కరోనా కేసులు నమోదు కాగా.. 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం 60,208 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,510 మంది మృతి చెందారు. పరీక్షించిన ప్రతి వంద మందిలో 24 మందికి పాజిటివ్ గా తేలుతోంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1444 కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లాలో 1236 కేసులు, చిత్తూరు జిల్లాలో 1180 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణ జిల్లాలో 10 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందగా, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు.

అలాగే చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. కర్నూలు జిల్లాలో 958, నెల్లూరు జిల్లాలో 934 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 810, విజయనగరం జిల్లాలో 566 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,359 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 21) వరకు ఏపీ రాష్ట్రంలో 1,57,93,298 శాంపిల్స్ పరీక్షించారు.