AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు
ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు...

AP Govt Employees : ఉద్యోగులు చెప్పినట్టే చేశారు.. సమ్మె దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. దీంతో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఖాయమైంది. ప్రస్తుత పీఆర్సీతో తమకు నష్టమని భావిస్తున్న ఉద్యోగులు.. మెరుగైన పీఆర్సీ కోసం చర్చల కంటే పోరుబాటకే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు ఉద్యోగులు. తాము సమ్మె చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనన్న అంశాన్ని సమ్మె నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించాయి.
Read More : AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు
అంతకుముందు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘ నేతలు తిరస్కరించారు.. కమిటి పరిధి ఏంటో తెలియనప్పుడు చర్చలకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు.. ఇప్పటి వరకు 12సార్లు చర్చలకు వెళ్లామని.. అయినా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తూ సమ్మె వైపే మొగ్గు చూపారు.. పీఆర్సీ జీవోలను ఉపసంహరిస్తేనే చర్చలకు వస్తామని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో…. పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగటానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజుకు మంత్రి పేర్నినాని, సూర్యనారాయణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్ చేసి సంప్రదింపులకు రావాలని కోరారు.
Read More : Stock Market : బ్లాక్ మండే, 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. మంత్రుల చర్చల ఆహ్వానంపైనా స్టీరింగ్ కమిటీలో చర్చించారు. అనంతరం మంత్రి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఏకపక్షంగా ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు తాము ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి జేఏడీ కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఫోన్ చేసి ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీతో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఇవాళ మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రభుత్వం అధికారికంగా కమిటీ వేయకుండా ఆ కమిటీతో చర్చలేమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు.. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని పెట్టాలని కోరారు. ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని, జీవోలు రద్దు చేసే వరకు ఎలాంటి చర్చలకూ వచ్చేది లేదని శశిభూషణ్కుమార్కు స్పష్టం చేశారు. శశిభూషణ్ కుమార్ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఊరకనే చర్చలకు రాబోమని, చర్చలకు పిలవాలన్నా చట్టబద్ధమైన కమిటీ ఏర్పడితే తప్ప ఆలోచన చేయలేమని తేల్చి చెప్పారు.
Read More : AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు
సూర్యనారాయణ : – పీఆర్సీ జీవోలు ఇవ్వడం..దాని పర్యావసనం పెరుగుదల బరువు తరుగుదల రిజల్ట్ అయినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేసినా…అధికారుల కమిటీ చెప్పిన మాటలను పదే పదే చెబుతున్న్నారని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యరాయణ విమర్శించారు. యావాత్త పౌర సమాజాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని భావిస్తున్నామన్నారు. నాలుగు జేఏసీలు ఒక స్ట్రగుల్ కమిటీగా ఏర్పడడం జరిగిందన్నారు. బలవంతంగా వేతన సవరణ రుద్దాలనే ప్రయత్నాన్ని ఆపి ఒక నెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తమకు జీవో ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకమో…రాజకీయ వివాదానికి తావిచ్చేలాగా ఉండకూడదన్నారు.
బండి శ్రీనివాసరావు : – రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉద్యోగులు ర్యాలీలు నిర్వహిస్తారని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉద్యోగులందరూ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో 12 సార్లు చర్చిస్తే…న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారుల కమిటీ పీఆర్సీ రిపోర్టును బయటపెట్టాలన్నారు.
వెంకట్రామిరెడ్డి : – ఉద్యోగ సంఘాల అపోహలను తొలించేందుకు కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతోందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పీఆర్సీ జీవోలు ఇచ్చిందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్ మెంట్ తప్ప ఏ అంశంపైనా చర్చలు జరగలేదన్నారు. జీఏడీ ప్రిన్స్ పల్ సెక్రటరీకి సమ్మె నోటీసు అందించామన్నారు.
- AP PRC : అన్యాయం జరిగింది, పీఆర్సీని అంగీకరించం.. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
- PRC Issue : ఉద్యోగులు లేకపోతే నేను లేను.. వారికి మంచి జరిగేలా చేస్తున్నాం
- AP PRC : జగన్ను కలవనున్న ఉద్యోగ సంఘాలు
- AP PRC : అడక్కుండానే ఎన్నో ఇచ్చారు.. సీఎం జగన్కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు
- Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు
1Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. కంగుతిన్న వరుడు బంధువులు
2Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న గుజరాత్ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
3Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
4Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
5Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
6Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
7US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
8Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
9Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
10Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు