CT Scan Fix Rate : సీటీ స్కాన్ కు రేట్ ఫిక్స్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
CT Scan Fix Rate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆస్పత్రులు, ల్యాబ్ల్లో ఇంతకు మించి అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
సీటీ స్కాన్, పాజిటివ్ వచ్చిన వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 డాష్ బోర్డులో పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, కోవిడ్ రోగుల చికిత్సలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.01 లక్షల మంది కోవిడ్ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది.
గతేడాది ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ నెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.