AP High Court Angry : ఎంపీ RRR అరెస్ట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది హైకోర్టు. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని

AP High Court Angry : ఎంపీ RRR అరెస్ట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

Ap High Court Angry

AP High Court Angry On Govt : వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మేజిస్ట్రేట్ కోర్టు ఆర్డర్స్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది హైకోర్టు. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశిస్తే, సాయంత్రం ఆరు గంటలకు వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదులను సూటిగా ప్రశ్నించింది కోర్టు. రాత్రి 11 గంటలకు ఆర్డర్‌ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది.

ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కస్టడీలో సీఐడీ పోలీసులు తనను కొట్టారని ఎంపీ ఫిర్యాదుతో.. ఈ విషయం దేశంలోనే సంచలనంగా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు నడుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. పిటిషన్ వేసి మరి తిట్లు తిట్టించుకుంటోంది ఏపీ ప్రభుత్వం.

మరోవైపు రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిన్న నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో తెలిపారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీంకోర్టు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలోనే ఉంటారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ ఆస్పత్రిలో ఎంపీ రఘురామకు రెండో రోజు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మొత్తం వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేస్తున్నారు.