ఏపీ ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారా?

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 10:37 AM IST
ఏపీ ఇంటర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారా?

విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాల విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం (జూన్ 12) సాయంత్రం 4 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి.

విజయవాడలోని గేట్ వే హోటల్ లో మంత్రి ఆదిమూలపు సురేశ్ తన చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి ప్రకటించనున్నారు. ఇంటర్ ఫలితాల్లో తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు విద్యార్థులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు చూసుకోవచ్చు. గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటిస్తారు. సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం గ్రేడ్లను ప్రకటిస్తారు. జూన్15 నుంచి ఇంటర్మీడియట్ అధికారిక వెబ్ సైట్లో షార్ట్ మెమోలను అందుబాటులో ఉండనున్నాయి.