AP PRC : పీఆర్సీ తెలంగాణ కంటే మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం-ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని...తెలంగాణ కంటే మెరుగ్గా పీఆర్సీ ఉంటుందని ఆశిస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు.
AP PRC : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని…తెలంగాణ కంటే మెరుగ్గా పీఆర్సీ ఉంటుందని ఆశిస్తున్నామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలిసి సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మ తో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఆశించామని..రాకపోవడంతో నిరాశ చెందాం అని ఆయన చెప్పారు.
సచివాలయంలో జీఏడి సర్వీసెస్ కార్యదర్శి శశిభూణన్ను కలిశామని….రేపు సాయంత్రం సిఎస్ నేతృత్వంలో పీఆర్సీపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఉందని చెప్పారన్నారు. 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్ ఇవ్వాలని సియం చెప్పినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పారని బండి శ్రీనివాస్ తెలిపారు.
Also Read : Wife Protest : కాపురానికి తీసుకు వెళ్లలేదని భర్త ఇంటిముందు భార్య నిరసన
రేపు సిఎస్ నిర్వహించే సమావేశంలో మా 71 డిమాండ్స్ పై చర్చించాలని కోరినట్లు ఏపిజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రేపటి సమావేశంలో ఉద్యోగులకు బకాయిపడ్డ 1600 కోట్లు విడుదల చేయాలని కోరామని…ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టిన 3 డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సజ్జల వ్యాఖ్యల వల్ల జీతాలు తగ్గుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉందని అపోహాలకు తావులేకుండా ముఖ్యమంత్రి తో చర్చలకు పిలవాలని బొప్పరాజు ప్రభుత్వాన్ని కోరారు.