AP Covid Cases : ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 141 కేసులు
ఏపీలో కరోనావైరస్(AP Covid Cases) మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 కరోనా పరీక్షలు
AP Covid Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు(AP Covid Cases) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 41, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 కేసులు వెలుగుచూశాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,17,953 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 23,01,210 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 2వేల 014 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 14వేల 729కి పెరిగింది. రాష్ట్రంలో నేటి వరకు 3,31,17,181 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్(AP Corona) విడుదల చేసింది. కాగా, క్రితం రోజుతో(71) పోలిస్తే ఇవాళ కొత్త కేసులు పెరిగాయి.
India Covid-19 Update : దేశంలో కొత్తగా 6,915 కోవిడ్ కేసులు నమోదు
అటు దేశంలోనూ రోజురోజుకూ కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల 10 వేల దిగువకు చేరిన కొత్త కేసులు.. తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్యా అదుపులోనే ఉంది. సోమవారం 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 915 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులు డిసెంబర్ చివరినాటి స్థాయికి చేరాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. ఇక ఇప్పటివరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది.
24 గంటల వ్యవధిలో మరో 180 మంది కోవిడ్ తో చనిపోయారు. క్రితంరోజు ఆ సంఖ్య 120 దిగువన ఉంది. దేశంలో ఇప్పటివరకు 5,14,023 మంది కోవిడ్ తో మరణించారు. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో బాధితుల సంఖ్య లక్ష లోపునకు చేరింది. దాంతో యాక్టివ్ కేసుల రేటు 0.22 శాతానికి తగ్గిపోయింది. నిన్న 16,864 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. రికవరీ రేటు 98.59 శాతానికి పెరిగింది. మరోపక్క 18 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 177 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్లో భారత్లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.
#COVIDUpdates: 1/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,17,953 పాజిటివ్ కేసు లకు గాను
*23,01,210 మంది డిశ్చార్జ్ కాగా
*14,729 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,014#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/BSfVPneCQX— ArogyaAndhra (@ArogyaAndhra) March 1, 2022