Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు

వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.

Minister Adimulapu Suresh : చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు : మంత్రి ఆదిమూలపు

Audimulapu Suresh

Minister Adimulapu Suresh : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గత తీర్పు రిపీట్ అవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం సొంత ఇంటి కల నెర వేరుస్తుందని అన్నారు. అమరావతిలో 50 వేల మందికి పట్టాలు ఇవ్వాలని సంకల్పించారు.. కానీ, పెత్తందార్లు, ఎల్లో మీడియా అడ్డుకున్నారని మండిపడ్డారు.

ఆర్ 5 జోన్ లో జరుగుతున్నది అభివృద్దేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తాము చట్టాలను ఉల్లఘించడం లేదని స్పష్టం చేశారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని టీడీపీ పిటిషన్ వేయడం దారుణం అన్నారు.  బాలినేని విషయలో ఎలాంటి పొరపొచ్చాలు లేవని తేల్చి చెప్పారు. బాలినేనిని పోలీసులు అడ్డుకున్నది వాస్తవం అన్నారు.

Audimulapu Suresh: పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఏపీ మంత్రి

బాలినేని విషయంలో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలు తెలిసిన నాయకుడు, ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు చేశారని వెల్లడించారు. నీటి సరఫరా వ్యవస్థను ఆధునీకరించారని, మునిసిపాలిటీలో మెరుగైన సదుపాయాలు కల్పించారని తెలిపారు. పట్టణంలో అన్ని పార్కులు అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

గత పాలకులు అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మెరుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. 175 నియోజక వర్గాల్లో శివ ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మల్యే లేరని పేర్కొన్నారు. ఇన్ని మంచి పనులు చేసినా శివ ప్రసాద్ రెడ్డిపై కొందరు విమర్శలు చేయడం బాధాకరం అన్నారు.