Meruga Nagarjuna : దొంగ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు : మంత్రి మేరుగ నాగార్జున

జగన్ పాలనలో ఒక్క పైసా అవినీతి జరిగినట్లు నిరూపించగలవా..? అని సవాల్ చేశారు. కుల రాజకీయాలు చేసే మూర్కుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Meruga Nagarjuna : దొంగ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు : మంత్రి మేరుగ నాగార్జున

Merugu Nagarjuna

Meruga Nagarjuna : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖయలు చేశారు. దొంగ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడని వ్యాఖ్యానించారు. 600 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. మళ్ళీ మోసం చేయాలని చంద్రబాబు మాయ మాటలు చెబుతున్నాడని పేర్కొన్నారు. కరోనా వస్తే తండ్రీకొడుకులు హైదరాబాద్ కు పారిపోయారని.. ఎన్నికలు వస్తుంటే రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయకుండా ఇప్పుడు మళ్లీ గెలిస్తే చేస్తా అంటున్నాడని పేర్కొన్నారు. 73 ఏళ్ల వయసులో హుందాగా మాట్లాడకుండా భూతులు ఏంటని ప్రశ్నించారు. జగన్ పాలనలో ఒక్క పైసా అవినీతి జరిగినట్లు నిరూపించగలవా..? అని సవాల్ చేశారు. కుల రాజకీయాలు చేసే మూర్కుడు చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Merugu Nagarjuna : ప్రొఫెసర్ నుండి అమాత్యుడిగా .. అప్పుడు వైఎస్ఆర్‌తో.. ఇప్పుడు జగన్ వెంట..

14 ఏళ్ల చంద్రబాబు పాలన.. నాలుగేళ్ల జగన్ పాలనపై దమ్ముంటే చర్చకు రండి అంటూ ఛాలెంజ్ చేశారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు పేటెంట్ కార్యక్రమం ఒక్కటి లేదని విమర్శించారు. అవినీతి, అపార్థాల నాయకుడిగా చంద్రబాబుకి పేటెంట్ ఉందని ఎద్దేవా చేశారు. తమకు నాలుగు నెలలు ఉందో.. 40 ఏళ్లు ఉందో ప్రజలు తేలుస్తారని పేర్కొన్నారు. మంత్రి మేరుగ నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు.

కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని స్పష్టం చేశారు. కన్నా భూతులతో బ్రతికాడు.. అవినీతితో కోట్లు సంపాదించాడని ఆరోపించారు. చంద్రబాబు నన్ను చంపేస్తాడన్న కన్నా.. మళ్ళీ ఆయన పంచన చేరాడని విమర్శించారు. 2024లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ పోటీ చేస్తాడో.. ఎక్కడ గెలుస్తాడో చూద్దామని చెప్పారు.