Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు

ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది.

Chittoor : నిశ్చితార్థం సంబరాల్లో విషాదం.. 50 అడుగుల లోతులో పడిన బస్సు, మృతుల వివరాలు

Accident

Bus Accident Chittoor: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతి చెందగా…ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు విడిచారు. ఇక మరికొందరికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి వెళుతుండగా ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పటి వరకు నిశ్చితార్థం సంబరాల్లో ఉన్న ఆ ఇంట విషాదం నెలకొంది. అంగరంగ వైభవంగా జరగాల్సిన వేడుకలో…విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More : Chittoor : చిత్తూరులో పెళ్లి బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

తిరుపతిలో ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన కలిచి వేస్తోంది. ప్రమాదంలో చిన్నారులు సైతం గాయాలపాలయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతికి ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. బస్సులో పెళ్లి కుమారుడు, అతని బంధువులు ఉన్నారు. అందరూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటున్న సమయం. ఘాట్‌ రోడ్డులోకి ఎంటరవగానే ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. అంతే లోయలో పడిపోయింది. బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురైపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కొంతమంది ప్రాణాలు వీడిచారు. మరికొంత మంది గాయాల పాలయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. 2022, మార్చి 26వ తేదీ శనివారం ఉదయం తిరుచానూరులో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.

Read More : IPL2022 KKR Beats CSK : ఐపీఎల్‌లో కోల్‌కతా బోణీ.. చెన్నైపై గెలుపు

దీంతో ధర్మవరం నుంచి మధ్యాహ్నం ప్రైవేటు బస్సులో 63 మందితో బయలుదేరారు. దొనకటి గంగమ్మ గుడి దాటాక పెద్ద మలుపు వద్ద బస్సు అమాంతం అదుపు తప్పింది. సుమారు 50 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా పెద్ద పెట్టున రోదించారు. ఒకరిపై ఒకరు పడి కాళ్లు చేతులు విరగడం.. తలలకు గాయాలై ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చిమ్మచీకటి కావడంతో ప్రమాద విషయం ఆలస్యంగా తెలిసింది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఆరుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారు. మృతుల్లో ఓ మహిళ, చిన్నారి ఉన్నారు. గాయపాలైన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధితులను పరామర్శించారు.

మృతి చెందిన వారి వివరాలు : డ్రైవర్ నభి రసూల్, మల్లిశెట్టి వెంగప్ప, మల్లిశెట్టి గణేశ్, కాంతమ్మ, మల్లిశెట్టి మురళి, జె.యశస్విని, క్లీనర్.