బడేటి బుజ్జి మరణం టీడీపీకి తీరని లోటు : చంద్రబాబు

టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే

  • Published By: veegamteam ,Published On : December 26, 2019 / 02:56 AM IST
బడేటి బుజ్జి మరణం టీడీపీకి తీరని లోటు : చంద్రబాబు

టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే

టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరం అన్నారు. ఎమ్మెల్యేగా.. ఏలూరు అభివృద్దికి విశేష కృషి చేశారని చంద్రబాబు ప్రశంసించారు. ఏలూరును స్మార్ట్ సిటీగా చేయాలని బుజ్జి పరితపించారని చంద్రబాబు అన్నారు.

బడేటి బుజ్జి మృతి ఏలూరు నియోజకవర్గానికే కాకుండా టీడీపీకి కూడా తీరని లోటు అన్నారాయన. బడేటి బుజ్జి కుటుంబసభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలిపారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

బుధవారం(డిసెంబర్ 25,2019) అర్థరాత్రి తర్వాత గుండెపోటు రావడంతో బడేటి బుజ్జి మృతి చెందారు. రాత్రి 2 గంటలకు ఆయనకు తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు ఆయనను ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 2004 లో బుజ్జి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఏలూరు మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు.

2014 లో టీడీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. సినీ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావుకు బడేటి బుజ్జి మేనల్లుడు. బడేటి బుజ్జి మృతితో టీడీపీ షాక్ లో మునిగిపోయింది. ఆయన మరణం పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీకి తీరని లోటు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Also Read : టీడీపీలో విషాదం: కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మృతి