Pawan Kalyan : ఒక్క ఛాన్స్ ప్లీజ్.. జనసేనకు ఒక్క అవకాశమివ్వండి, మార్పు అంటే ఏంటో నేను చూపిస్తా-పవన్ కల్యాణ్

2024కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి. జనసేన ప్రభుత్వం రావాలి. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. మార్పు అంటే ఏమితో చూపిస్తా.

Pawan Kalyan : ఒక్క ఛాన్స్ ప్లీజ్.. జనసేనకు ఒక్క అవకాశమివ్వండి, మార్పు అంటే ఏంటో నేను చూపిస్తా-పవన్ కల్యాణ్

Pawan Kalyan : పేదలకు జగనన్న కాలనీల పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు జనసేనాని పవన్ కల్యాణ్. జగనన్న ఇళ్లు-పేదల కన్నీళ్లు పేరుతో జనసేన చేపట్టిన సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు. 2020లో ప్రారంభించిన ఇళ్లు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని దింపేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత.

ప్రతీ జగనన్న కాలనీలో రూ.10 వేల నుంచి రూ.15వేల కోట్ల స్కామ్ జరిగిందని పవన్ ఆరోపించారు. పేదల ఇళ్ల కుంభకోణంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానన్నారు పవన్ కల్యాణ్. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు పవన్. జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే మార్పు చూపిస్తామన్నారు పవన్ కల్యాణ్.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గుంకలాంకు ర్యాలీగా వెళ్లిన పవన్ కు కార్యకర్తలు అడుగడుగునా స్వాగతం పలికారు. గుంకలాంలో జగనన్న కాలనీని సందర్శించారు పవన్. గుంకలాంలో 397 ఎకరాల్లో జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. 2020లో ఈ కాలనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసినా.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడంపై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు పవన్ కల్యాణ్.

రెండేళ్లలో ఇళ్లు పూర్తి చేస్తామని కేవలం పైలాన్ మాత్రమే నిర్మించారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భారీ స్కామ్ చేశారని, ప్రతీ జగనన్న కాలనీలో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనిపై కేంద్రానికి, ప్రధాని మోదీకి తానే స్వయంగా ఫిర్యాదు చేస్తానన్నారు పవన్.

వైసీపీ ప్రభుత్వం మోసాన్ని ప్రజలు గ్రహించాలన్న పవన్.. ఉత్తరాంధ్ర ప్రజలకు బలమైన రాజకీయ అధికారం దక్కాలన్నారు. జనసేనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మార్పు అంటే ఏమితో చూపిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రజలకు సూచించారు పవన్. జనసేన ప్రభుత్వం వస్తే ఇసుకు ఫ్రీగా ఇస్తామని, అవినీతికి పాల్పడే వారిని జైలుకి పంపిస్తామన్నారు జగన్.

”2024కి వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలి. జనసేన ప్రభుత్వం రావాలి. ఈ ఒక్కసారి జనసేనకు అవకాశం ఇవ్వండి. నాకు కోసం నేను అడగట్లే. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క అవకాశం అడుగుతున్నా. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను” అని పవన్ అన్నారు.