Gudivada Casino : క్యాసినో వివాదం, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కొడాలి నాని సవాల్

కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాటలు నిర్వహించినట్లు నిరూపిస్తే..రాజకీయాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకుంటే..చంద్రబాబు, లోకేష్ లు...

Gudivada Casino : క్యాసినో వివాదం, నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. కొడాలి నాని సవాల్

Kodali Nani

Gudivada Casino: గుడివాడలో క్యాసినో అంశం హీటెక్కిస్తోంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. దీంతో దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని. తనకు చెందిన కళ్యాణ మండపంలో క్యాసినో, పేకాటలు నిర్వహించినట్లు నిరూపిస్తే..రాజకీయాలను వదిలేస్తానని సంచలన ప్రకటన చేశారు. నిరూపించకుంటే..చంద్రబాబు, లోకేష్ లు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు.

Read More : Pakistan Pilot: డ్యూటీ టైం ముగిసిందని విమానాన్ని మధ్యలో వదిలేసి పోయిన పాకిస్తాన్ పైలట్

క్యాసినో అంటే వారికే ఎక్కువ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆనాడు సైకిల్ గుర్తు తెచ్చుకున్నారని, గుడివాడలో డ్యాన్సుల విషయం తెలుసుకుని…ఆపాలని తానే స్వయంగా డీఎస్పీకి తెలియచేయడం జరిగిందన్నారు. కరోనా వచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత కేబినెట్ లో పాల్గొనడం జరిగిందని, కేవలం తనపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Read More : Ameenpur : అమీన్‌‌పూర్‌‌లో కుటుంబం సూసైడ్ మిస్టరీ.. ఆత్మహత్యా ? హత్య ?

2022, జనవరి 21వ తేదీ శుక్రవారం కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ కు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. క్యాసినో నిర్వహణపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గుడివాడ వీధులు రాళ్ల దాడితో అట్టుడికాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. రాళ్ల దాడిలో టీడీపీ నేత బోండా ఉమ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులే అద్దాలు పగులకొట్టించారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తకు గాయాలైనట్లు సమాచారం. మరి మంత్రి కొడాలి నాని చేసిన సవాల్ కు టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.