కరోనాతో బాధపడుతోన్న భార్యను చంపేసిన భర్త

కరోనాతో బాధపడుతోన్న భార్యను చంపేసిన భర్త

Man Killed Wife

Man Killed Wife: కరోనా కోరలు చాస్తున్న వేళ నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన భార్యను కిరాతకంగా హత్యచేశాడు ఓ కసాయి భర్త. కావలి​ పోలీసు స్టేషన్​ పరిధిలో వాయునందన ప్రెస్ రోడ్‌లో మాల్యాద్రి అనే వ్యక్తి భార్యతో కలిసి భోజనం ప్యాకెట్లు అమ్ముకుంటూ బతుకుతున్నాడు.

పది రోజుల క్రితం మాల్యాద్రికి, అతని భార్య అనురాధకు కరోనా సోకింది. 10రోజులుగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు ఇద్దరు. అయితే అనురాధకు కరోనా తీవ్రం కాగా.. ఊపిరి పీల్చుకోడం కష్టంగా మారింది.

ఈ క్రమంలోనే అనురాధ నిద్రిస్తుండగా మణికట్టును కోసి మాల్యాద్రి చంపేశాడు. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అవ్వగా.. ఇద్దరూ చనిపోవాలిని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లుగా భర్త చెబుతున్నాడు.

భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని అనుకున్నారు. ముందుగా అనురాధ మణికట్టు కోసి, తర్వాత తాను చనిపోవాలని అనుకున్నాడు. ధైర్యం సరిపోక బయటకు వచ్చి మద్యం తాగి మత్తుతో పడిపోయాడు. ఉదయాన్నే మత్తులో నుంచి లేచి బయటకు వచ్చి, తర్వాత పోలీసులకు లొంగిపోయి అసలు విషయం వెల్లడించాడు.

మాల్యాద్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కావాలనే చేశాడా? ఇద్దరు మాట్లాడుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నారా? అనే విషయాన్ని విచారిస్తున్నారు. ఇంకా కరోనా ఉందా? లేదా? అని స్థానిక ఏరియా ఆసుపత్రిలో టెస్టింగ్ చేయిస్తున్నారు.