Suspected Boat : శ్రీలంక నుంచి నెల్లూరుకు కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు..చూడటానికి తరలివచ్చిన ప్రజలు

శ్రీలంక నుంచి నెల్లూరు సముద్రతీరానికి కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు చూడటానికి భారీగా తరలి వచ్చారు ప్రజలు.

Suspected Boat : శ్రీలంక నుంచి నెల్లూరుకు కొట్టుకొచ్చిన పడవలో దేవుళ్ల విగ్రహాలు..చూడటానికి తరలివచ్చిన ప్రజలు

Suspected Boat In Idols Of Gods At Nellore District Sea

Suspected Boat At Nellore District sea : నెల్లూరు జిల్లాలోని సముద్ర తీరానికి ఓ పడవ కొట్టుకొచ్చింది. ఆ పడవ ఇప్పుడు స్థానికులకు మిస్టరీగా మారింది. అప్పుడప్పుడు సముద్ర తీరానికి పడవలు కొట్టుకుని వస్తుంటాయి. సముద్ర అలల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు లాక్‌లు తెగిపోయి చిన్న, చిన్న పడవలు తీరాలకు కొట్టుకువస్తుంటాయి. కానీ నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవ మాత్రం..మిస్టరీగా మారింది.

ఆ పడవలో కనిపించినవి చూసి.. మత్స్యకారులు మరింత విస్తుపోయారు. నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెందురుబొంగులతో తయారు చేసిన ఓ నాటు పడవ కట్టుకొచ్చింది. ఆపడవ వెదురు బొంగులతో నిర్మాణం చేసి ఉండటం..ఓ వింతగా అది కనిపించటంతో మత్స్యకారులకు ఆ పడవపై ఆసక్తి పెరిగింది. అదేంటో చూద్దామని ఆసక్తిగా వెళ్లి చూశారు. ఆ పడవలో దేవుళ్ల విగ్రహాలు కూడా ఉండటంతో మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.

ఈ పడవ లోపల ఎవరన్నా ఉన్నారా? లేదా మరేవైనా ఉన్నాయా? అని ఆసక్తిగా దాన్ని వద్దకు వెళ్లి చూశాడు. ఆ పడవలో బుద్దుడు విగ్రహం, శివలింగం కనిపించటంతో ఆశ్చర్యపోయారు. వెంటనే మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి..సమాచారం అందించారు. మత్సకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు.

ఆ పడవ శ్రీలంకకు చెందినదనీ మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై.. పడవ ఇలా తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్తరకం పడవను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకువచ్చిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు తెలియనున్నాయి.