Thirumala : తిరుమలలో రెండేళ్ల తర్వాత పెరిగిన భక్తుల రద్దీ
సొంత వాహనాలు, ఇతర వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సివస్తోంది.

Tirumala
Thirumala devotees : తిరుపతి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుపతిలో దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. వారాంతపు సెలవులు కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో.. అలిపిరి చెక్పోస్టు వద్ద వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. సొంత వాహనాలు, ఇతరత్రా వాహనాల్లో తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి ప్రాంతం వద్ద వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. తనిఖీలు ఆలస్యం అవుతుండడంతో భక్తులు గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తోంది.
కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. రోజుకు 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. దీంతో వెంకన్న కొండకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి కల్యాణకట్ట, అన్నప్రసాదం ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. అలిపిరి మెట్ల మార్గంలోనూ భక్తుల రద్దీ పెరిగింది.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.84కోట్ల విరాళం
మరోవైపు తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఇప్పటికే శుక్రవారం వీఐపీ రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మొన్న టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుంచి టీటీడీ ఆన్లైన్లో దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.
TTD : తిరుమలలో ఎవ్వరికైనా స్వామి వారి అన్నప్రసాదమే.. ప్రైవేటు హోటల్స్ బంద్
ఇక మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. అంతేకాకుండా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో తిరుపతిలోని కౌంటర్లలో అందజేయనున్నారు. టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్లైన్లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
గత నెలలోనూ పరిమిత సంఖ్యలోనే టికెట్లు రిలీజ్ చేయగా.. కాసేపటికే అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈసారి టికెట్ల సంఖ్య పెంచినా కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు వెంటనే కొనేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్లో మాత్రమే టికెట్లు పొందవచ్చు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది.