కడప : కారులో రూ. కోటి విలువైన 2.7 కిలోల బంగారం..

కడప : కారులో రూ. కోటి విలువైన 2.7 కిలోల బంగారం..

Kadapa : One crore worth gold seized  : కడప జిల్లాలో రూ. కోటి విలువైన 2.7 కిలోల బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల జరుగనున్న క్రమంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో కడప-తాడిపత్రి రహదారిపై మంగళవారం (ఫిబ్రవరి2) ఓ కారుని సోదాలు చేసిన పోలీసులకు కారులో భారీగా బంగారం ఉన్నట్లుగా గుర్తించారు.

ఆ కారులో మొత్తం 2.7 కిలోల బంగారం లభ్యమైంది. దీంతో కడప జిల్లా పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారిస్తున్నారు. కానీ కారు డ్రైవర్ పొంతన లేని సమాధానాలు చెప్పటంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

కాగా ఏపీలో పంచాయితీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు కడప-తాడిపత్రి రహదారిపై ముద్దనూరు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పులివెందుల నుంచి వస్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీలు చేశారు.

ఆ కారులో లభ్యమైన 2.7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.05 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారం అంతా నగల రూపంలో ఉంది. సదరు బంగారానికి సంబంధించి డ్రైవరు సరైన బిల్లులు చూపించకపోవడంతో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కారు డ్రైవర్ షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నగలు పులివెందులలోని ఓ జ్యుయెలరీ షాపుకు చెందినవని, వాటిని మెరుగు పెట్టించేందుకు ప్రొద్దుటూరు తీసుకెళుతున్నట్టు పోలీసుల విచారణలో డ్రైవర్ షఫీ తెలిపాడు. కానీ దీనిపై పలు అనుమానాలు ఉన్న క్రమంలో విచారణ కొనసాగిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం 2,773 గ్రాములు బంగారం పట్టుబడిందని పోలీసులు తెలిపారు.