Maha Sena Rajesh: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మహాసేన రాజేష్

Maha Sena Rajesh Joined TDP: మహాసేన రాజేష్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనను పార్టీలోకి చంద్రబాబు నాయుడు సాదరంగా ఆహ్వానించారు.

Maha Sena Rajesh: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మహాసేన రాజేష్

Maha Sena Rajesh: దళితులు అందరూ ఉండవలసిన పార్టీ ఒక్క టీడీపీ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా సామర్లకోటలో శుక్రవారం నిర్వహించిన దళిత సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజేష్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉందని, ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.

ఎస్సీల అభ్యున్నతి కోసం తాము ఎంతో చేశామని, జస్టిస్ పున్నయ్య అధ్వర్యంలో కమిషన్ వేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు భారతరత్న రావడంలో స్వర్గీయ ఎన్టీఆర్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. వైసీపీ నాయకులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారని తీవ్రస్థాయిలో పండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కీ అలవాటు పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులపై మేధావులు మాట్లాడాలని కోరారు. ప్రతి ఇంటి నుంచి జెండా పట్టుకుని ఒక్కొక్కరు బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు అనపర్తి సభ రద్దు చేస్తామని అధికారులు చెబుతున్నారని, వారి ఆటలు సాగనీయబోమని హెచ్చరించారు.

Also Read: కుమారుడ్ని కోల్పోయిన బాధిత మహిళకు రూ.4లక్షలు చెక్ అందించిన జనసేన

జనసేన మా మిత్రపక్షమే మహసేన రాజేష్
అంతకుముందు మహసేన రాజేష్ తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా సభా ప్రాంగణానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో మేము పాపం చేసి జగన్ ముఖ్యమంత్రి చేశాం. ఆ పాపం కడిగేసుకోడానికి 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాం. జనసేన మా మిత్రపక్షమే. పవన్ కల్యాణ్ మా మిత్రులు. ఆయనంటే మాకు గౌవరవం. మా లక్ష్యం సైకోని ఒడించడమే అని వ్యాఖ్యానించారు.