Medico Tapasvi Case : ప్రాణం తీసిన ప్రేమ.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన తపస్వి స్వగ్రామంలో తీవ్ర విషాదం

ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు.

Medico Tapasvi Case : ప్రాణం తీసిన ప్రేమ.. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన తపస్వి స్వగ్రామంలో తీవ్ర విషాదం

Medico Tapasvi Case : ప్రేమోన్మాది దాడిలో బలైన మెడికో విద్యార్థిని తపస్వి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురం గ్రామంలో తపస్వి హత్య వార్త తెలిసి ఆమె తాత, నాన్నమ్మలు కుప్పకూలిపోయారు. డాక్టర్ గా తిరిగొస్తుందని అనుకుంటే ఇలా జరిగిందంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.

తపస్వి ఘోర హత్యోదంతాన్ని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కళ్ల ముందే పుట్టి పెరిగిన బిడ్డ.. ఇలా విగత జీవిగా టీవీల్లో, ఫోన్‌లలో కనిపించడాన్ని స్వగ్రామం కృష్ణాపురం వాసులు తట్టుకోలేకపోతున్నారు. కాగా, మృతురాలు తపస్వి తండ్రి ముంబైలోని ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా పని చేస్తున్నారు.

తపస్వి చాలా ధైర్యవంతురాలని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సమస్యలున్నట్లు తపస్వి ఎన్నడూ తమకు చెప్పలేదంటున్నారు. ప్రేమ-వేధింపులు, తక్కెళ్లపాడులో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన విషయం కూడా తమకేమీ తెలియదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని తపస్వి బంధువులు డిమాండ్ చేశారు.

తన ప్రేమను కాదని, పెళ్లికి నిరాకరించిందని జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్ తో తేజస్విపై దాడి చేశాడు. ఆమె గొంతుకోశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి మృతి చెందింది.

Also Read..Man Killed Girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

సోమవారం గుంటూరు తక్కెళ్లపాడులో జరిగిన ఈ ఘోరం.. యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమోన్మాది చేతిలో డెంటల్‌ విద్యార్థిని తపస్వి(21). దారుణ హత్యకు గురైంది. దగ్గర్లో పరీక్షలు ఉండడంతో స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లిన తపస్విపై హఠాత్తుగా దాడికి దిగిన జ్ఞానేశ్వర్‌.. ఆమె గొంతు కోసి పైశాచికంగా హతమార్చాడు.

పుట్టిన కొన్నిరోజులకే తపస్వినిని ఆమె తల్లిదండ్రులు వృత్తిరిత్యా.. తాత-నానమ్మల దగ్గర వదిలేశారు. అలా పెరిగి ఐదో తరగతి దాకా కృష్ణాపురంలోనే చదువుకుంది తపస్వి. అనంతరం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అక్కడే ఇంటర్ దాకా చదువుకుంది. నాలుగేళ్ల కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు ముంబైకి బదిలీ అయ్యింది. దీంతో.. బీడీఎస్‌ చదివేందుకు విజయవాడ వచ్చి హాస్టల్‌లో ఉంటోంది తపస్వి.

Dead body In Drum : డ్రమ్‌లో డెడ్ బాడీ.. విశాఖలో సంచలనం రేపిన కేసులో వీడిన మిస్టరీ

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ జ్ఞానేశ్వర్‌.. ఇన్‌స్టాగ్రామ్‌ లో తపస్వికి పరిచయం అయ్యాడు. ఆపై ప్రేమ, పెళ్లి అంటూ వేధింపులు మొదలుపెట్టాడు. సోమవారం సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి.. సర్జికల్‌ బ్లేడ్‌తో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె స్నేహితురాలి అరిచి.. సాయం కోసం పరిగెత్తగా తలుపులు వేసి మరీ తపస్విని ఘోరంగా చంపాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.