Minister Roja : ఆడదాన్ని ఏడిపిస్తే ఏమవుతుందో తెలుసా?.. చాగంటి ప్రవచనం వీడియో షేర్ చేసిన మంత్రి రోజా
బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై మంత్రి రోజా మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. స్త్రీలను అవమానిస్తున్న వారిని సమర్థించడం సిగ్గుచేటు అన్నారు.
Minister Roja Selvamani: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ వర్సెస్స్ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నేతలు ఒకరిపై ఒకరు అసభ్యకర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి, మంత్రి రోజా సెల్వమణి మధ్య చెలరేగిన వివాదం ఏపీ రాజకీయాలను ఓ కుదుపుకుదిపేస్తోంది. మంత్రి రోజాపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారంటూ బండారు సత్యనారాయణ మూర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, సత్యనారాయణమూర్తిని సొంత పూచీకత్తుపై విడుదల చేయాలని గుంటూరు మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ స్రవంతి మంగళవారం రాత్రి అదేశాలు జారీ చేశారు.
Read Also : మంత్రి రోజా కంటతడి.. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుందని సీరియస్ వార్నింగ్
బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై మంత్రి రోజా మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. స్త్రీలను అవమానిస్తున్న వారిని సమర్థించడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళా సాధికారతకు పాటుపడుతున్న నా గొంతు నొక్కాలని చూస్తున్నారని, దమ్ముంటే బండారు మాట్లాడినట్లు నాపై సీడీలను ప్రజల ముందుకు తీసుకుండి అంటూ రోజా అన్నారు. బండారును వదిలిపెట్టనని, న్యాయపోరాటం చేస్తానని రోజా స్పష్టం చేశారు.
Read Also : టీడీపీ నేత బండారు సత్యనారాయణకు ఊరట, బెయిల్ మంజూరు, న్యాయం ధర్మం గెలుస్తుందని కామెంట్
టీడీపీ నేత బండారుకు బెయిల్ మంజూరైన నేపథ్యంలో.. రోజా తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘స్త్రీ కన్నీటి బొట్టు గురించి చాగంటి వారి ప్రవచనం’ అంటూ రోజా ట్వీట్ చేశారు.
❝ స్త్రీ కన్నీటి బొట్టు గురించి
చాగంటి వారి ప్రవచనం ❞ pic.twitter.com/6rshDIRACU— Roja Selvamani (@RojaSelvamaniRK) October 3, 2023