Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి

రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి

Repalle

Repalle: రేపల్లె ఘటనపై మానవాళికే సిగ్గుచేటు అని మంత్రి సురేశ్ అభిప్రాయపడ్డారు. నిండుచూలాలు అనే మానవత్వం మరిచి గర్బిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

“ఘటన గురించి న్యాయవాదులతో చర్చలు జరిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపనున్నాం, తగిన సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ చేసి విచారణ చేపడతాం. ఘటన ప్ల రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా”

“ఈ ఘటన జరిగిన వెంటనే బాపట్ల పోలీసులు స్పందించిన తీరు అమోఘంగా ఉంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా రైల్వే అధికారులతో చర్చించనున్నాం”

Read Also: రేపల్లె ఘటన బాధితురాలికి నేడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ

“ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయడం మానాలి. బాధితురాలు ఘటన నుంచి ఇంకా తేరుకోలేని పరిస్థితిలో ఉంది.
ఆమె పట్ల మానవత్వంతో వ్యవహరించి కనీస గోప్యత అనే ప్రొటోకాల్ పాటించాలి”

“ప్రతిపక్షాలు సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నా. ఇందులో మా ప్రభుత్వం ఎటువంటి దాపరికాలు చేయడం లేదు. అత్యంత పారదర్శకతతో వ్యవహరిస్తున్నాం. ప్రస్తుతం బాదితురాలు, కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు”

“రాష్ట్రం బీహార్‌లా మారిందని లోకేష్ అంటున్నారు. టీడీపీ హయాంలో ఎన్ని సంఘటనలు జరిగాయనే లెక్కలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నాం. మీరు సిద్దమా” అని సవాల్ విసిరారు.