ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత అనుమానాస్పద మృతి..రైల్వేట్రాక్ పై మృతదేహం
Manchuri Venkata Ramanareddy died : చిత్తూరు జిల్లా పీలేరు మాజీ ఎంపీపీ, ఎంజేఆర్ విద్యాసంస్థల అధినేత మంచూరి వెంకట రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోడుమల్లువారిపల్లెకు చెందిన వెంకట రమణారెడ్డి పీలేరు- కల్లూరు మార్గంలోని అగ్రహారం సమీపంలో ఎంజేఆర్ ఇంజినీరింగ్ కళాశాలను నిర్వహిస్తున్నారు.
నిన్న కళాశాల ముగిసిన అనంతరం కారులో పులిచెర్ల మండలం కొడిదిపల్లె సమీపంలోని రైల్వే గేటు వద్దకు వెళ్లారు. అక్కడ రైల్వే ట్రాక్పై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.