Phone Tapping In YCP : వైసీపీలో హీట్ పుట్టిస్తోన్న ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. అధిష్టానంతో కోటంరెడ్డి రెడ్డి ఢీ అంటే ఢీ

వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హీట్ పుట్టిస్తోన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీసీ అధిష్టానంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు.

Phone Tapping In YCP : వైసీపీలో హీట్ పుట్టిస్తోన్న ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. అధిష్టానంతో కోటంరెడ్డి రెడ్డి ఢీ అంటే ఢీ

YCP PHONE

Phone Tapping In YCP : వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హీట్ పుట్టిస్తోన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీసీ అధిష్టానంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.

సాక్ష్యాలు బయటపడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయని ఇంతవరకు ఊరుకున్నానని కోటంరెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇవాళ సాక్ష్యాలు బయటపెడతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఉదయం 10 గంటలకు మీడియా ముందుకు వచ్చి ఆధారాలు బహిర్గతం చేస్తానన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచన చేస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయాల్లో నెల్లూరు రూరల్ వైసీపీ పాలిటిక్స్ మరింత వేడి రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Andhra Pradesh : సాక్ష్యాలు బయటపెడితే ‘గవర్నమెంట్ షేక్ అవుతుంది’..ఐపీఎస్‌ల ఉద్యోగాలు ఊడుతాయ్ : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోటంరెడ్డి, ఆనం వ్యాఖ్యలను బాలినేని, అనిల్, కాకాణి ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు అవాస్తమని వైసీసీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆధారాలుంటే చూపాలని నిన్న బాలినేని సవాల్ విసిరారు. టీడీపీలోకి వెళ్లేందుకు శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని బాలినేని పేర్కొన్నారు.

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నా ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోంది అంటూ కోటం రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్న వేళ దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని ఆ సాక్ష్యాలు బయటపెడితే ఏపీ గవర్నమెంట్ షేక్ అవుతుంది అంటూ ఆటంబాబు పేల్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆ సాక్ష్యాలు బయటపెడితే ఐపీఎస్ ల ఉద్యోగాలు ఊడుతాయన్నారు.

Andha Pradesh Politics : మా పార్టీవారే మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ

రెండుసార్లు నాపై ఉన్న గౌరవంతో జగన్ నాకు టికెట్ ఇచ్చారు. ఆయనపై నాకు గౌరవం ఉంది అంటూనే ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు బయటపెడితే సెంట్రల్ నుంచి ఎంక్వైరీ వచ్చా నానా యాగీ అవుతుందని అన్నారు. నమ్మకం లేనిచోట నేను ఉండనని స్పష్టంచేసిన కోటం రెడ్డి డిసెంబర్ 23 వరకు నాకు పార్టీ మారాలనే ఆలోచనే లేదు. కానీ ఆ తరువాత నాకు నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తెలిసిందనీ..పార్టీ మారాలనుకుంటున్నానని..2024లో టీడీపీ తరపు నుంచి పోటీకి దిగుతాను నెల్లూరు రూరల్ నుంచే పోటీకి దిగుతాను అంటూ కోటం రెడ్డి స్పష్టంచేశారు. ఫోన్ ట్యాపింగ్ తో తన మనసు కలత చెందిందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై మరో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు నా ఫోన్, నా పీఏ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని.. నాకు ప్రాణహాని ఉంది అని ఆనం వ్యాఖ్యానించారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ ల విషయంలో వైసీపీలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ముసలం రాజుకున్నట్లుగా తెలుస్తోంది. నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. నా పీఏ ఫోన్ కూడా చేశారు. ఇది దాదాపు రెండేళ్లుగా జరుగుతోంది. నా పిల్లలతో నేను ఫోన్ మాట్లాడాలన్నా ఫేస్ యాప్ లో మాట్లాడుకోవాల్సి వస్తోంది ఇది మా పరిస్థితి. ఇది మాపార్టీవారే చేస్తున్నారు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? అంటూ ఆనం వాపోయారు.

Andhra Paradesh Politics : YCPలో కోటంరెడ్డి కుంపటి..2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తానంటూ బాంబు పేల్చిన నెల్లూరు నేత

కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం ప్రస్తుతం వైసీపీ పార్టీ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని..నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ స్టర్ రాజకీయాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టుల ముప్పు ఉన్న నాకు సెక్యూరిటీని తగ్గించారంటూ వాపోయారు ఆనం. నెల్లూరు వైసీపీ నేతలు గ్యాంగ్ స్టర్లలా తయారయ్యారని రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను చంపేయాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.