Nandamuri Ramakrishna : కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ ఫైర్.. మంచి రోజులు రాబోతున్నాయ్
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది కొడాలి నాని అంటూ నందమూరి రామకృష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీ మోసం చేసిన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానురీతిగా నందమూరికుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Nandamuri Ramakrishna : మాజీ మంత్రి, YCP ఎమ్మెల్యే కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను మోసం చేసింది కొడాలి నాని అంటూ దివంగత నేత నందమూరి తారకరామారావు కుమారుడు నందమూరి రామకృష్ట ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లి లాంటి టీడీపీ పార్టీ మోసం చేసిన కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అని ఆ విషయాన్ని మర్చిపోయి ఇష్టానురీతిగా నందమూరికుటుంబ సభ్యులపై వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే అర్హత కొడాలి నాని(Kodali Nani)కి లేదన్నారు. నందమూరి వంశాన్ని చంద్రబాబు మోసం చేశారని వ్యాఖ్యలు చేస్తున్న నాని మోసానికి దిగజారింది తనే అనే విషయం మర్చిమాట్లాడుతున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థం అయిందంటూ విమర్శించారు. మా ఇంటి అల్లుడు చంద్రబాబు నిమ్మకూరు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంటి అల్లుడు గ్రామానికి వస్తే చంద్రబాబు కృష్ణా జిల్లా రావటానికి అర్హత లేదంటూ స్థానిక ఎమ్మెల్యే అనడం విడ్డూరంగా ఉందన్నారు.ఇప్పుడున్న ప్రభుత్వ పాలనలో రాష్టం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని దీన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. అడుక్కోవడానికి చిప్ప కూడా మిగల్చని ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు నందమూరి రామకృష్ణ. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకొనే రోజులు దగ్గర లోనే ఉందన్నారు.
Also Read: ఛాలెంజ్ అంటే ఫేక్ సెల్ఫీ పిక్ కాదు.. అలాచేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్
నిమ్మకూరులో చంద్రబాబు రాత్రికి బస చేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తంచేసిన నందమూరి రామకృష్ణ.. చంద్రబాబు కి ఎక్కడికైనా వెళ్లే అర్హత ఉందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం(NTR Family) అంతా ఒకే వేదికపై ఉన్నామని సస్పష్టం చేసిన రామకృష్ణ మాకు ఎటువంటి విభేధాలు లేవని తేల్చి చెప్పారు. చంద్రబాబు నిమ్మకూరు ఎలా వస్తారు అని స్థానిక ఎమ్మెల్యే వ్యాఖ్యలు సరికాదని మరోసారి స్పష్టం చేశారు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna).
Also Read: అప్పటి నుంచి నా తమ్ముడి ఇంటికి నేను వెళ్లలేదు: కిరణ్ కుమార్ రెడ్డి
కాగా తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నిమ్మకూరు వెళ్లారు. చంద్రబాబు నిమ్మకూరు వెళ్లటంపై స్థానిక ఎమ్మెల్యే నిమ్మకూరు రావటానికి చంద్రబాబు అర్హత లేదు అంటూ చేసిన వ్యాఖ్యలపైనా కొడాలి నాని చంద్రబాబుపైనా.. నందమూరి కుటుంబం పైనా చేసే వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పారు నందమూరి రామకృష్ణ.. అలాగే నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని (nandamuri suhasini)ని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.