Nara Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ పని చేస్తాం: నారా లోకేశ్

టీడీపీ హయాంలో చాలా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవని, ఇపుడు అన్నిటినీ మూసేశారని తెలిపారు.

Nara Lokesh: ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే ముందుగా ఈ పని చేస్తాం: నారా లోకేశ్

Lokesh Yuvagalam Padayatra

Nara Lokesh – TDP: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని ఆ పార్టీ నేత నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు (Nellore) జిల్లా చిల్లకూరు మండలం కాకువారిపాలెం క్యాంపు కార్యాలయంలో యువతతో నారా లోకేశ్ ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు.

ఏపీలో తాము పాత విద్యా విధానాన్ని తీసుకొస్తామని లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో చాలా డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవని, ఇపుడు అన్నిటినీ మూసేశారని తెలిపారు. వాటిని మళ్లీ తీసుకొస్తామని చెప్పారు.

అధికారం చేపట్టగానే ఏపీకి కంపెనీలను తీసుకొస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని నారా లోకేశ్ తెలిపారు. అలాగే, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతామని చెప్పారు. సీఎం జగన్ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లాల బిభజన చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అన్ని మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు.

ఏపీకి రాజధాని కూడా లేకుండా చేశారని నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో గంజాయి మత్తులో విద్యార్థులు బలైపోతున్నారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్