Janasena : నన్ను ప్యాకేజ్ స్టార్ అన్న సన్నాసిని చెప్పు తీసుకుని కొడతా : పవన్ కళ్యాణ్

నన్ను ప్యాకేజ్ స్టార్ అన్నవారిని చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Janasena : నన్ను ప్యాకేజ్ స్టార్ అన్న సన్నాసిని చెప్పు తీసుకుని కొడతా : పవన్ కళ్యాణ్

Pawan Kalyan, who expressed extreme anger on YCP leaders,

Janasena Pawan Kalyan : విశాఖపట్టణం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై ఫుల్ ఫైర్ మీదున్నారు. తీవ్ర ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీపై దూకుడుగా పెంచారు. వివాఖనుంచి నేరుగా మంగళగిరి వచ్చిన పవన్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం యత్నించారు. ఇదిలా ఉంటే మంగళగిరి పార్టీ ఆఫీసులో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై జనసేన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేస్తే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి అంబటిరాంబాబు తనను ప్యాకేజీ స్టార్ అంటూ చేసిన విమర్శలపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నన్ను ప్యాకేజీ స్టార్ అన్న సన్యాసుల్ని చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను అంటూ చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇఛ్చారు. ఇష్టమొచ్చినట్లుగా బూతులు మాట్లాడితే ఒక్క చేతితో గొంతు పిసికేస్తానంటూ తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మీలాగా బూతులు మాట్లాడటం నాకు రావు అన్న పవన్ నాకు మీలాంటిభాష రాదు..ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టే నేను మాట్లాడటంలేదు. కానీ నాసహనానికి కూడా ఓ హద్దు ఉంది. ఇష్టానుసారంగా నాపై విమర్శలు చేస్తే నేను లండన్ లో పెరగలేదు..మీలాగా మాట్లాడటం నాకు రాదు అనుకుంటున్నారా? మాట్లాడగలను కానీ నాకు సంస్కారం ఉంది అందుకే మాట్లాడటం లేదు. ఇప్పటికైనా బూతులు మాట్లాడటం మానకపోతే మీలాంటివారిని ఎలా అణచాలో నాకు తెలుసు అంటూ మండిపడ్డారు.

నేను బాపట్లలో పెరిగా..ఉప్పూ కారం తిని పెరిగా..మీఇష్టమొచ్చినట్లుగా బూతులు మాట్లాడితే చూస్తూ ఊరుకోను బదులు చెబుతా..చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతా ఒక్కో సన్యాసిని అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్ల కాలంలో నేను 6 సినిమాలు చేశాను.రూ.100 కోట్లు సంపాదించా మీలాగా ప్రజల్ని దోచుకోలేదు. కష్టపడి సంపాదించాను. అటువంటినన్ను ప్యాకేజీలు తీసుకునే వ్యక్తిని అని విమర్శించటానికి మీలాగా సంస్కారంలేకుండా పెరగలేదు అంటూ విమర్శించారు. నేను సంపాదించిన ప్రతీరూపాయికి న్యాయంగా కట్టాల్సిన ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాను మీలాగా ఎగ్గొట్టలేదు. రూ.33కోట్ల 37 లక్షల ట్యాక్స్ కట్టానని..అదనంగా జీఎస్టీ కూడా కట్టానని స్పష్టంచేశారు పవన్ కళ్యాణ్.

2021-2022లో రూ.55 కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చానని..నేను సిద్ధాంతాలు..విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా అడ్డగోలుగా..బూతుల రాజకీయాలు చేయను అంటూ నన్ను ప్యాకేజీ స్టార్ అన్న సన్యాసి ఎవరో వారి పళ్లు చెప్పుతో రాలగొడతాను అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలకు ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబుకి. ఎందుకంటే పవన్ ని ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు మోచేతి నీళ్లు తాగేవాడు అని అన్నది అంబటి రాంబాబే.

విశాఖలో వైసీపీ చేపట్టిన గర్జన కార్యక్రమం..జనసేన పార్టీ ప్రజావాణి కార్యక్రమాల నేపథ్యంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏపీని అట్టుడికిస్తున్నాయి. ఈక్రమంలో జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ..వైసీపీ ఊపే ఉడత ఊపులను భయపడనని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనిపై మంత్రి అంబటి రియాక్ట్ అవుతూ..పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ఊపులకు ఉడతలు కూడా భయపడవని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీని దించుతానంటావు కానీ.. నేనే గద్దెనెక్కుతాననలేవన్నారు. పవన్ ది ఓ రాజకీయ పార్టీనా ? అని మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. అంబటి వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలంలా మండిపడ్డారు పవన్. నన్ను ప్యాకేజీ స్టార్ అన్న సన్యాసుల్ని చెప్పు తీసుకుని పళ్లు రాలగొడతాను అంటూ చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇఛ్చారు.