Ashoka Gajapati Raju : కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై కేసు నమోదు

రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాప‌న కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Ashoka Gajapati Raju : కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై కేసు నమోదు

Ashoka Gajapati

Case registered on Ashoka Gajapati Raju : కేంద్ర మాజీమంత్రి అశోకగజపతి రాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారు. దీంతో 473, 353 సెక్షన్ల కింద అశోకగజపతి రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాప‌న కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాప‌న జ‌రుగుతున్న స‌మయంలో తనను కొబ్బరికాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేసిన అశోక్ గజపతి రాజు… ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో శిలాఫలకం బోర్డును తొలగించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల సాయంతో మంత్రులు శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ఆలయ ధర్మకర్తగా అశోక్ గజపతి రాజును ఆహ్వానించడం జరిగిందన్నారు. దేవాలయ శంకుస్థాపనలో ఎక్కడా ప్రోటోకాల్ తప్పలేదని స్పష్టం చేశారు.

CM Jagan : ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ సూచనలు

అశోక గజపతి రాజుకు కార్యక్రమం ఇష్టం లేనట్లుగా ఉందని అందుకే.. గంట ముందే చేరుకొని వీరంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి. ఆయనకి ఏ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. ఆయన మాట్లాడే తీరు అభ్యంతకరంగా ఉందని, శంకుస్థాపన కార్యక్రమాన్ని సర్కస్ తో పోల్చడం దురదృష్టకరమని వెల్లడించారు. ఏ రోజైనా ఆయన ఆలయ అభివృద్ధికి ప్రయత్నించారా అని సూటిగా ప్రశ్నించారు. విగ్రహాలను టీటీడీ ఉచితంగా ఇచ్చింది కనుకే…అశోక్ ఇచ్చిన విరాళం తీసుకోలేదని మంత్రి వెల్లంపల్లి వివరణనిచ్చారు.

అంతకంటే ముందు.. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఘటన జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు నిందితులను పట్టుకోలేదని.. ఏడాదిలో గుడి కట్టి తీరుతామని చెప్పి ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగకపోవడం దారుణమ‌ని వ్యాఖ్యానించారు. ఆలయ ధర్మకర్తకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని, గుడికి విరాళం ఇస్తే నా మొహంపై విసిరి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారాయన. విరాళాలు తిరస్కరించడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చార‌ని ప్ర‌శ్నించారు.