AP Politics: బీజేపీ ఏంటో జనాలకు అర్ధం అవుతుంది: మంత్రి బొత్స

అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు

AP Politics: బీజేపీ ఏంటో జనాలకు అర్ధం అవుతుంది: మంత్రి బొత్స

Somu

AP Politics: ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. బీజేపీపై మరోసారి అసహనం వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స, బీజేపీ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తుందో అందరికి అర్థమైందని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడమనే విషయం చాలా హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి బొత్స, ఈ విషయంపై మాట్లాడటానికి చాలా అసభ్యకరంగా చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు.

Also Read: Squirrel Attack 18 people: ఉడతే కదాని ఊరుకుంటే 18 మందిని ఆసుపత్రికి పంపింది

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మొపోతుందని, సామాన్యుడికి అవసరమైన నిత్యవసర వస్తువుల ధరలు పెంచి బిజేపి పార్టీ ప్రజలను పీడిస్తుందన్నారు. ఇన్ని చేస్తున్న బీజేపీ నేతలకు..ఏపీలో తమ ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్టు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మద్యాన్ని ఒక నిత్యావసర వస్తువుగా భావించడం అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మంత్రి బొత్స అన్నారు. రాజకీయాలను బీజేపీ ఏ విధంగా తూకం వేస్తుందో ఆ పార్టీ నేతల మాటల్లో తెలిసిపోతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Also Read: Indian Military in 2021: 2021లో భారత మిలిటరీలో జరిగిన 11 ప్రమాదాలు