Nellore : నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం.. మంత్రి బంధువులు మృతి

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు

Nellore : నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం.. మంత్రి బంధువులు మృతి

Nellore

Nellore : నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.

మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మంత్రి ఆళ్లనాని బంధువులైనట్లు తెలుస్తోంది.