Road Accidents 7 Women Died : ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి  చెందారు.

Road Accidents 7 Women Died : ఏపీలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి

ACCIDENT

Road Accidents 7 Women Died : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందారు. కాగా, నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి  చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా అముదాలవలస మండలం మందడిలో వేగంగా వచ్చిన లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నంద్యాల జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం నేరేడుచర్ల వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.