Industries : ఏపీలో రూ.2వేల 134 కోట్లతో కొత్తగా 5 పరిశ్రమలు.. 7వేల 683 మందికి ఉద్యోగాలు

రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా..

Industries : ఏపీలో రూ.2వేల 134 కోట్లతో కొత్తగా 5 పరిశ్రమలు.. 7వేల 683 మందికి ఉద్యోగాలు

Industries

Industries : రాష్ట్రంలో కొత్తగా ఐదు పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలను ఏర్పాటు చేయనుండగా.. 7వేల 683 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.

పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట వారికి భూములు కేటాయించాలన్నారు. భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని అధికారులతో చెప్పారు.

Read More..Snoring : గురకతో ఎముకలకు ముప్పే…

* కడప జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ లిమిటెడ్‌ ఏర్పాటు
* ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీ
* రూ.110 కోట్ల పెట్టుబడి, 2112 మందికి ఉద్యోగాలు

* బద్వేల్ లో ప్లైవుడ్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న సెంచురీ
* రూ.956 కోట్ల పెట్టుబడి.. 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
* ఈ పరిశ్రమ ఏర్పాటుతో రైతులకు భారీగా మేలు జరుగుతుందన్న అధికారులు
* దాదాపు 22వేల 500 ఎకరాల్లో యూకలిఫ్టస్‌ చెట్లను కొనుగోలు చేస్తారన్న అధికారులు
* దాదాపు రూ.315 కోట్ల ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేస్తారన్న అధికారులు

* తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీ గ్రీన్‌సిగ్నల్‌
* చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న గ్రాసిం ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ
* ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి, 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు
* స్థానిక ప్రజల ఆందోళన నేపథ్యంలో థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ను పెట్టబోమని స్పష్టం చేసిన గ్రాసిమ్‌ కంపెనీ
* స్థానిక ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణాన్ని విరమించుకున్నామంటూ స్పష్టం చేసిన కంపెనీ.. కంపెనీ స్పష్టత నేపథ్యంలో ఎస్‌ఐపీబీ ఆమోదం.

Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

* కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల (హెచ్‌ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్‌) తయారీ పరిశ్రమను నెలకొల్పనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
* రూ.127 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 1800 మందికి ఉద్యోగాలు
* కొప్పర్తి ఈఎంసీలోనే మరొక పరిశ్రమ పెట్టనున్న ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
* ల్యాప్‌టాప్ లు, ట్యాబ్‌లెట్స్, కెమెరా, డీవీఆర్‌ తయారీ
* రూ.80 కోట్ల పెట్టుబడి, 1100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇవ్వనున్న డిక్సన్‌