Chandrababu Letter : రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? : సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని చెప్పారు.

Chandrababu Letter : రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? : సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

Chandrababu (2)

Chandrababu letter CM Jagan : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను లేఖలో పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ప్రభుత్వ ఉదాసీనతే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోకపోవడం అమానుషం అన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో హోంమంత్రికి తెలియకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా అని ప్రశ్నించారు. ఉంటే ఎన్ని కేసులు నమోదు చేశారో చెప్పాలన్నారు.

ప్రత్యేక హోర్టు ఏర్పాటు చేసి దోషులకు కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందన్నారు. మహిళల పట్ల హింస, అత్యాచార ఘటనలు పెరగడానకి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణం ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి విజయవాడ అసుపత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. కూతురు కనిపించడంలేదని స్వయంగా బాధితురాలి తల్లిదండ్రలు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేసినా.. పోలసులు పట్టించుకోకపోవడం అమానుషం అన్నారు.

Chandrababu: ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం, రాయితీ రావట్లేదు: చంద్రబాబు గ్రామ సభలో రైతులు

విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని చెప్పారు. జాతీయ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు రాష్ట్రంలోనే జరుగుతుండటం అవమానకరం అన్నారు.
మహిళలపై జరుగుతున్న భౌతిక దాడులు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపు ఘటనల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటం గర్హనీయమని పేర్కొన్నారు.

దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశ చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్‌ రేప్‌ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్‌, మద్యం వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఇలాంటి నేరాలు నిత్యకృత్యమయ్యాయని తెలిపారు.

Chandrababu: వైకాపా ఎమ్మెల్యే అవినీతి గురించి చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్న వైకాపా నాయకుడు: ఆసక్తికర ఘటన

ముఖ్యమంత్రిగా మీ చర్యలు, మీ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్‌ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండి అని సూచించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతికి కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇల్లు, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.