తల్లిదండ్రులను నరికిన కసాయి కొడుకు..తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం

తల్లిదండ్రులను నరికిన కసాయి కొడుకు..తల్లి మృతి, తండ్రి పరిస్థితి విషమం

The son who attacked the parents..the mother died : కృష్ణా జిల్లాలో ఓ కసాయి కన్న తల్లిదండ్రులపైనే దాడికి పాల్పడ్డాడు. తల్లి, తండ్రిని దారుణంగా నరికాడు. ఈ దాడిలో తల్లి మరణించగా…. తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన నాగాయలంక మండలం ఎదురుమొండిలో చోటు చేసుకుంది.

ఎదురుమొండి గ్రామానికి చెందిన వీర్లంకమ్మ, నాగేశ్వరావు కుమారుడు వీర రాఘవయ్యకు కొన్నేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీర రాఘవయ్య, అతడి భార్య మధ్య కొన్నాళ్లుగా కలహాలు మొదలయ్యాయి. ఈ కలహాలకు తన తల్లిదండ్రులే కారణమని భావించిన రాఘవయ్య… రాత్రి పడుకున్న తల్లిదండ్రులపై దాడి చేశాడు. ఇద్దరి తలపైనా నరికాడు.

ఈ దాడిలో తల్లి వీర్లంకమ్మ అక్కడికక్కడే చనిపోయింది. తీవ్ర గాయాలపాలైన తండ్రి నాగేశ్వరావును చికిత్స కోసం అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇక వీర రాఘవయ్య… పరారయ్యాడని.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.