Kanipakam Temple : కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు

గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

Kanipakam Temple : కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం.. పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు

Kanipakam

Thugs set fire to old chariot wheels : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిత్తూరు కాణిపాకం ఆలయ సమీపంలో దారుణం జరిగింది. కాణిపాకం ఆలయానికి చెందిన పాత రథ చక్రాలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గోశాల పక్కన నిల్వ ఉంచిన పాత రథ చక్రాలు అగ్ని ఆహుతి అయ్యాయి. గత కొంతకాలంగా గోశాల పక్కనే పాత రథ చక్రాలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేసినా పనా? లేక కావాలనే ఇంకెవరైనా చేశారా? అనే కోణంలో విచారణ చేపట్టారు.

కాణిపాకం ఆలయం వెనుకవైపు గోశాల ఉంది. గోశాలకు ఆనుకుని ఉన్న అతిథి గృహం వద్దే పాత రథ చక్రాలు ఉన్నాయి. చాలా కాలంగా రథ చక్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ రథ చక్రాలు తుప్పు పట్టి పోయి ఉన్నాయి. అనూహ్యంగా ఈరోజు తెల్లవారుజాము దాటిన తర్వాత ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

Objections : ఏపీలో కొత్త జిల్లాలపై అభ్యంతరాలు

గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు కూడా పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? లేదా ఏదైనా ప్రమాదం జరిగిందా? అన్న కోణంలో ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

కాణిపాకం ఆలయ అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటన కారకులను పట్టుకుంటామని చెప్పారు. సీసీ పుటేజీని పరిశీలిస్తాం.. కానీ దగ్గర్లో సీసీ కెమెరాలు లేవని తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.