Tirumala : తిరుమ‌ల‌లో ఇద్ద‌రు దళారులపై కేసు న‌మోదు

తిరుమలలో ద‌ర్శ‌నం టికెట్ల‌ు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tirumala : తిరుమ‌ల‌లో ఇద్ద‌రు దళారులపై కేసు న‌మోదు

Tirumala

Tirumala :  తిరుమలలో ద‌ర్శ‌నం టికెట్ల‌ు ఇప్పిస్తానని మోసం చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతికి చెందిన సూరి అనే దళారి ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు ఇప్పిస్తాన‌ని బెంగ‌ళూరుకు చెందిన జ‌య‌ప్ర‌కాష్ అనే భ‌క్తుడి నుంచి రూ.22,800/- గూగుల్ పే ద్వారా తీసుకున్నాడు. అనంత‌రం టికెట్లు ఇవ్వ‌కుండా మోసం చేశాడు.

అదేవిధంగా, త‌మిళ‌నాడులోని విల్లుపురానికి చెందిన ఆర్‌.శ‌ర‌త్‌కుమార్ ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌తో శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం తిరుప‌తికి చేరుకున్నారు. ఆన్‌లైన్ ద‌ర్శ‌న టికెట్ల కోసం ప్ర‌య‌త్నించ‌గా అందుబాటులో లేవు. వీరు అలిపిరి పాదాల వ‌ద్ద ఉండ‌గా చంద్ర‌శేఖ‌ర్ అనే ఆటోడ్రైవ‌ర్ ప‌రిచ‌యం చేసుకుని ద‌ర్శ‌న టికెట్లు ఇప్పిస్తాన‌ని గూగుల్ పే ద్వారా రూ.5000/- వ‌సూలు చేశాడు.

శ‌ర‌త్‌కుమార్‌కు వాట్సాప్‌లో ద‌ర్శ‌న టికెట్లు పంపాడు. ఈ టికెట్ల‌తో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నానికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా స్కానింగ్ పాయింట్ వ‌ద్ద అవి న‌కిలీవిగా గుర్తించారు. బాధితుల‌ ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు ఇద్ద‌రు ద‌ళారుల‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ద‌ర్శ‌నం టికెట్ల పేరుతో మోసం చేసిన సూరి, చంద్ర‌శేఖ‌ర్‌ల‌పై తిరుమ‌ల టూ టౌన్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Also Read : Viral Video : శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న కోతి-వైరల్ వీడియో